లైగర్ దెబ్బ.. డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్!.. పూరి ఆడియో లీక్?

-

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లైగర్. భారీ అంచనాల నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో డిస్టిబ్యూటర్లకు నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ కు వార్నింగ్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు.

ఇందులో భాగంగానే నైజాం కు చెందిన 83 మంది ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వాట్సప్ మెసేజ్ వైరల్ గా మారింది. అయితే ఈ విషయం పూరి జగన్నాథ్ వరకు పోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఆడియో ఒకటి వైరల్ కూడా అయింది. ఇస్తానని చెప్పినా ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇవ్వబుద్ధి కాదు. నా పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా బుద్ధి కాదు. పోకిరి నుంచి ఈస్మార్ట్ శంకర్ వరకు… బయ్యర్స్ నుంచి నాకు కొంత డబ్బు రావాలి. ఆ డబ్బులు వసూలు చేసి పెడతారా అని ప్రశ్నించాడు. అంతేకాదు ధర్నా చేసేవాళ్ల లిస్టు ఇవ్వండి. ధర్నా చేయని వారికి నేను డబ్బులు ఇస్తా అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news