ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న పీవీ సింధు.. మహిళల సింగిల్స్‌లో ఘన విజయం

-

టోక్యో: ఒలింపిక్స్‌లో పీవీ సింధు అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రత్యర్థులపై విరుచుపడుతున్నారు. పాయింట్స్‌కు అవకాశం ఇవ్వకుండా సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లో చెంగ్ యీపై 21-6, 21-16 తేడాతో సింధు గెలుపొందారు.

pv sindhu
pv sindhu

మూడు రోజుల క్రితం జరిగిన గ్రూప్ జె తొలి మ్యాచ్‌లోనూ ఆమె విజయం సాధించారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై సింధు విజయం సాధించి ఒలింపిక్స్‌లో బోణీ కొట్టారు. ఇప్పుడు మరో విజయం సాధించి ఆమె ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

గత ఒలింపిక్స్‌లో కొంచెంలో స్వర్ణం దక్కలేదు. ఇప్పుడు స్వర్ణం కోసం సింధు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు బ్యాట్‌కు పనిచెబుతున్నారు. ఎలాగైనా సరే ఈ సారి గోల్డ్ మెడల్‌ను వదులుకునే ఛాన్స్ ఇవ్వనని ఆమె అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news