Radhe shyam: ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య విభేదాలు..! అస‌లు విష‌యంపై క్లారిటీ ఇచ్చిన చిత్ర‌యూనిట్

-

Radhe shyam: డిజిట‌ల్ యుగంలో ఏ విష‌య‌మైనా.. ఇట్టే అంద‌రికీ తెలిసిపోతుంది. నిమిషాల్లో వైర‌ల్ అవుతుంది. అందులో హీరో హీరోయిన్స్ రూమ‌ర్స్, గాసిప్స్‌ విష‌య‌మైతే..చెప్పావ‌ల్సిన‌వ‌స‌రంలేదు. ఆ విషయాలు చర్చల్లో నిలుస్తుంటాయి. అయితే.. ఇవి కొందరికి స్టార్‏డమ్ తెచ్చిపెడితే.. మరికొందరిని మాత్రం.. చిక్కుల్లో పడేశాయి. ప్రస్తుతం హాట్ బ్యూటీ పూజా హెగ్డే పరిస్థితి కూడా అంతే..

ప్రస్తుతం ఈ బ్యూటీ మీద నెగిటివ్ టాక్ వ‌చ్చింది. గత కొద్ది రోజులుగా పూజ‌కు వ్య‌తిరేకంగా.. ఓ వార్త వైర‌ల్ అవుతుంది. ఫిల్మ్ న‌గ‌ర్‌లో చక్కర్లు కొడుతుంది. ‘‘రాధే శ్యామ్’’ సినిమా షూటింగ్ లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య విభేధాలు వ‌చ్చాయ‌ని, ఆమె షూటింగ్ కి సమయానికి రాకుండా, ప్రతిరోజూ ఆలస్యం చేస్తున్నారట. ఆమె తీరుపై ప్ర‌భాస్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో రొమాంటిక్ సన్నివేశాలు సరిగా రావడం లేదనేది టాక్. విడివిడిగా షూట్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి.

అయితే ఈ వివాదంపై రాధే శ్యామ్ చిత్ర యూనిట్ స్పందించారు. మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలతో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ప్రభాస్, పూజా మధ్య ఏలాంటి విబేధాలు లేవ‌నీ, అఫ్ స్క్రీన్ లో వాళ్ల హెల్తీ రిలేషన్ కారణంగా ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చక్కగా పండుతుందని,
పూజా మంచి టైం సెన్స్‌ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్‌గా ఉందని పుకార్లకు చెక్ పెట్టేశారు మూవీ మేక‌ర్స్‌.

యూరప్ బ్యాక్ డ్రాప్‎లో పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధేశ్యామ్. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన వ‌ర్డ‌ల్ వైడ్ గా విడుద‌ల కానున్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news