కేసీఆర్ ప్రస్ట్రేషన్ తో ఇలా మాట్లాడుతున్నారు- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

-

కేసీఆర్ మీడియా సమావేశం తరువాత బీజేపీ నేతలు ఒక్కోక్కరుగా కౌంటర్లు ప్రారంభించారు. బీజేపీ పై చేసిన విమర్శలకు ప్రతిగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైరయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడవంతో కేసీఆర్ అసహనంతో ఉన్నారన్నారు ఆయన. కేసీఆర్ కు ఎప్పడు కోపం వచ్చినా.. బీజేపీని తిట్టడం ఫ్యాషన్ గా మారిందని.. గత ఏడు సంవత్సరాల్లో ఇదే విధంగా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కేసీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పించారన్నారు. కేంద్రం వడ్లను కొనం అని ఎప్పుడూ చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనం అని అందని స్పష్టం చేశారు రఘునందన్ రావు. కేంద్రం రాష్ట్రానికి సహకరింకుంటే నిలదీయండని..దాన్ని స్వాగతిస్తాం అన్నారు. గతంలో అవినీతి ఆరోపణల్లో పలు రాష్ట్రాల సీఎంలు జైలుకు వెళ్లారని.. తప్పు చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తుందని బండి సంజయ్ అన్నారని వివరించారు. మిగతా రాష్ట్రాలు పెట్రోల్ పై ధరలు తగ్గిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news