బ్రేకింగ్: ఈ రోజు రాత్రి మా ఆయన్ని చంపాలని చూస్తున్నారు: రఘురామ భార్య

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయనను కోర్ట్ చెప్పినా సరే పోలీసులు గుంటూరు జిల్లా జైలుకి తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన సతీమణి రమాదేవి మీడియాతో మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందో మాకు అర్ధం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని జైల్లో పెట్టి హత్యలు చేసే వారిని రోడ్డు మీద తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ రోజు రాత్రి మా అయ్యానని చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రమేష్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని కోరామని కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. పోలీసులు మా ఆయన్ని బాగా కొట్టారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news