విదేశాలకు సోనియా గాంధీ.. తోడుగా రాహుల్, ప్రియాంక

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హెల్త్ చెకప్ కోసం మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. సోనియాగాంధీ వెంట రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా వెళ్ళనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తెలిపింది. అయితే ఏ దేశానికి, ఎప్పుడు వెళ్తున్నారు మాత్రం వివరాలు తెలుపలేదు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి వద్దకు కూడా సోనియాగాంధీ వెళ్తారని ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం తెలిపారు.

ఇదిలా ఉంటే పెరుగుతున్న ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 4 న కాంగ్రెస్ “మెహంగై పర్ హల్లా బోల్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు జై రామ్ రమేష్. మరోవైపు సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ చేపట్టే ” భారత్ జోడోయాత్ర” ప్రారంభం కానుంది. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్న తరుణంలో సోనియా గాంధీ మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news