3 ఫీట్లు ఉన్న నువ్వు నన్ను తొక్కుతావా – రాజగోపాల్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎవరిని పండపెట్టి తొక్కుతావు? నువ్వు ఉన్నది ఎంత మూడు ఫీట్లు.. నన్ను తొక్కుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మునుగోడు ప్రజలు చూస్తూ ఊరుకోరు అని అన్నారు.

రేవంత్ రెడ్డి వెనక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ టిడిపి తో పొత్తు పెట్టుకునే చచ్చిపోయిందన్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ లో చేరాడు అంటూ ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నది చంద్రబాబేనని అన్నారు. కాంగ్రెస్ ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి వేల కోట్లు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ కాంగ్రెస్ ని నాశనం చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో రేవంత్ నాయకత్వంలో 9 ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని అన్నారు. పొన్నాల హయాంలో 21, ఉత్తమ్ హయాంలో 19 ఎమ్మెల్యేలు గెలిచారని.. కానీ రేవంత్ హయాంలో సింగిల్ డిజిట్ వస్తుందని జోష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news