జక్కన్నకు మరో అరుదైన గౌరవం… హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన చిత్రాల సందడి

-

భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో హాలీవుడ్‌లోనూ ఆయన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసి ఎంతోమంది హాలీవుడ్‌ ప్రముఖులు సలామ్‌ అంటూ మెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో జక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. విశేష ఆదరణ పొందిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో బియాండ్‌ ఫెస్ట్‌ ఒకటి. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఫెస్ట్‌ నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు జరగనున్న ఈ ఫెస్ట్‌లో.. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రదర్శించనున్నారు.

 

ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ టీమ్‌ ఓ ట్వీట్‌ చేసింది. సెప్టెంబర్‌ 30న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, అక్టోబర్‌ 1న ‘ఈగ’, ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, అక్టోబర్‌ 21న ‘మగధీర’, అక్టోబర్‌ 23న ‘మర్యాద రామన్న’ ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో జక్కన్న ఫేమ్‌ మరింత పెరిగిందని, ఆయన తెరకెక్కించిన చిత్రాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని నిర్వాహకులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news