ప్రియుడితో లేచిపోయిన రాజశేఖర్ కూతురు.. క్లారిటీ ఇదే

-

ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ అయ్యారు.ప్రియుడితో కలిసి దుబాయ్ కి చెక్కేసింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.తాజాగా ఈ వార్త రాజశేఖర్ ఫ్యామిలీ కంట పడినట్టు కనిపిస్తుంది. ఈ వార్త పై రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక మండిపడ్డారు.శివాత్మిక రాజశేఖర్ ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది.

 

అయితే తప్పుడు ప్రచారం చేసిన వారిపై మండిపడుతూ ” ప్రియుడితో పారిపోయానని వార్తలు రాస్తున్నారు.ఇంతకీ పారిపోయింది నేనా?మా అక్కన?అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో నెక్స్ట్ లెవెల్ న్యూస్ రాస్తున్నారు.పుకార్లు రాసేటప్పుడు అయినా కొంచెం క్లారిటీగా రాయండి అంటూ ఫైర్ అయ్యింది.కాగా శివాత్మిక ప్రస్తుతం ” పంచతంత్రం” సినిమా చేస్తోంది.జి 5 లో ప్రసారం కానున్న ‘ఆహ నా పెళ్ళంట ‘ అనే వెబ్ సిరీస్ లోనూ కనిపించనుంది.రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.మరోవైపు రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ” శేఖర్” సినిమాలో శివాని ఓ ముఖ్య పాత్ర పోషించింది.

Read more RELATED
Recommended to you

Latest news