తెలంగాణ హోం మంత్రి రబ్బర్ స్టాంపా- ఎమ్మెల్యే రాజాసింగ్

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు టీఆర్ఎస్ పై ఫైరయ్యారు. తెలంగాణలో క్రైం రేట్ పెరుగుతుందని, ఆడపిల్లలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆరా.? కేటీఆరా? హోంమంత్రా? అని ప్రశ్నించారు. హోం మంత్రి కేవలం రబ్బర్ స్టాంప్ గా మారారని విమర్మించారు. ఐటీపైన అసెంబ్లీలో చెత్త పేపర్ ఇచ్చారని అందులో అంతా అబద్ధమే అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ అంశంపై మాట్లాడినా కేంద్రాన్ని టార్గెట్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారని దుయ్యబట్టారు. మరోక టీం టీఆర్ఎస్ కు భజన చేసేందుకే ఉందని ఎద్దేవా చేశారు. నిజాం షుగర్ ప్యాక్టరీని కేసీఆర్  ఓపెన్ చేయమంటే కేటీఆర్ ఓపెన్ చేస్తామని పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఎవరు కరెక్ట్ అని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీని కేంద్రమే స్థాపిస్తుందని గుర్తుచేశారు. అలాగే కేంద్రం ఆత్మనిర్బర్ భారత్ కింద నిధులిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై బీజేపీ సిద్ధంగా ఉందని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news