వెంకయ్య నాయుడు పై వర్మ సెటైర్… కొరియర్ బాయ్ అంటూ !

-

ఇవాళ న్యూ ఢిల్లీ లో లో జరిగిన 67 వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. తమ కుటుంబంతో కలిసి అవార్డుల వేడుక కు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. అయితే గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు… ఈ అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందజేసి.. అభినందించారు.

అయితే… రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వివాదాస్పద, దర్శకుడు, రాంగోపాల్ వర్మ… సంచలన ట్వీట్ చేశారు. స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కొరియర్ బాయ్ అంటూ సంబోధించాడు రామ్ గోపాల్ వర్మ. “సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొరియర్ మ్యాన్ ద్వారా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగినది” అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ వెంకయ్యనాయుడు పై చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉపరాష్ట్రపతి ని పట్టుకుని ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. వెంటనే వెంకయ్య నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Read more RELATED
Recommended to you

Latest news