ముగిసిన రామచంద్ర భారతి, నందకుమార్ పోలీసుల విచారణ

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ పోలీసుల విచారణ ముగిసింది. వీరిద్దరిని నాంపల్లి కోర్టులో బంజారా హిల్స్ పోలీసులు హాజరు పరిచారు. నేడు ఉదయం రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్గూడా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన క్షణాలలోనే బంజర హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫేక్ పాస్పోర్ట్, పాన్ కార్డు వ్యవహారంలో రామచంద్ర భారతి పై కేసు నమోదు చేశారు. ఇక నందకుమార్ పై లీజు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటూ కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు చేయించి అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 41 రోజులుగా జైలులో ఖైదీలుగా ఉన్న వీరు.. ఈ కేసులో విడుదల కాగానే ఇలా మరో కేసులో అరెస్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news