ఇండియా ఎంపీలకు కరోనా…?

-

కరోనా వైరస్ ఇప్పుడు ప్రముఖులకు కూడా చుక్కలు చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఈ వైరస్ ఇప్పుడు అందరికి సమన్యాయం చేస్తుంది. పుట్టిన చైనాలో కంట్రోల్ లోకి వస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను మాత్రం వణికించే విధంగా ఉంది. దాదాపు అన్ని దేశాలు దీని దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక విషయం బయటపడింది.

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కొనికా కపూర్ ఇటీవల లండన్ వెళ్లి వచ్చారు. ఆమెకు కరోనా వైరస్ ఉందని అధికారులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఆమె లండన్ నుంచి వచ్చిన తర్వాత లక్నో లో ఒక ప్రైవేట్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో ఎంపీలు కూడా పాల్గొన్నారు. పలువురు బిజెపి, కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి హాజరయ్యారు. దీనితో వారిలో ఎవరికి కరోనా ఉంది అనేది అర్ధం కావడం లేదు.

ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన వారు అందరికి పరిక్షలు చేసారు. ఇక దుష్యంత్ సింగ్ అనే ఎంపీకి కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరూ చాలా మందిని కలిసారు. వారిలో ఎవరికి కరోనా సోకిందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆమెపై కేసు కూడా నమోదు చేసారు అధికారులు. ఆమెను నిర్బంధం లో ఉంచారు. ఇక ఆ పార్టీకి వచ్చిన కొందరు ఎంపీలు రాష్ట్రపతిని కూడా కలిసారు. దీనితో ఆయనకు కూడా వైద్య పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news