రామోజీరావు మనవరాలి వివాహం..హాజరైన సీఎం కేసీఆర్

-

రామోజి గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు మనుమరాలు వివాహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక నిన్న ఘనంగా జరిగింది. దండమూడి అమర్ మోహన్‌దాస్‌, అనితల కుమారుడు వెంకట్‌ అక్షయ్‌.. ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.

ఈ నేపథ్యంలోనే.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు మోహన్‌బాబు, మురళీమోహన్‌, దర్శకుడు రాజమౌళి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్‌, సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి ఈ వేడుకకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news