గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్న రాములమ్మ.. మరి ఇంత దారుణమా..?

-

బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీముఖి బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటడమే కాకుండా ఈ మధ్యకాలంలో గ్లామర్ విషయంలో కూడా మరింత రెచ్చిపోతోంది. మొన్నటి వరకు గ్లామర్ విషయంలో ఆచితూచి అడుగులు వేసిన శ్రీముఖి.. ఇప్పుడు పూర్తిగా హద్దులు చెరిపేసింది అని చెప్పాలి. పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి అటు తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఆ క్రేజ్ తో కుర్ర హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించిన శ్రీముఖి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా నటించింది. అయితే ప్రస్తుతం సినిమాలలో అనుకున్నంత స్థాయిలో విజయాలు రాకపోవడం వల్లే సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి బుల్లితెరపైనే తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

అందులో భాగంగానే పలు సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. మరొక పక్క అవార్డు ఫంక్షన్లకు కూడా హోస్టుగా బాధ్యతలు చేపట్టింది. తాజాగా సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫోటోషూట్లను వదులుతూ మరింత రచ్చ చేస్తోంది. ముఖ్యంగా డిజిటల్ మనీ కోసం ప్రయత్నం చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకునే విధంగా వరుస హాట్ ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతుంది.. అంతేకాదు తాజాగా ఈమె ఆహా ఓటీటీ వేదికగా డాన్సింగ్ ఐకాన్ కాంపిటీషన్లో టీం లీడర్గా వ్యవహరిస్తోంది.

అక్కడ గ్లామర్ షో చేయడమే ప్రధానంగా పెట్టుకున్న ఈమె ఒక్కొక్కసారి ఫ్యాంట్ మర్చిపోయిందంటూ కూడా కామెంట్లను ఎదుర్కొంటుంది. అంతలా గ్లామర్ షో చేస్తూ మరింతగా వయ్యారాలు పోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అందులో థైస్ అందాలు చూపించే విధంగా శ్రీ ముఖి షేర్ చేసిన ఫోటోలు మరింతగా అగ్గి రాజేస్తున్నాయని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news