విశాఖలో దారుణం… ఫోన్ ఎక్కువగా వాడుతుందని కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం

-

సమాజంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు, చిన్నా-పెద్ద, ఆడ-మగ అని తేడాలు లేకుండా పశువాంఛ తీర్చుకోవడానికి కామాంధులు వెనకాడటం లేదు. దేశంలో నిర్భయ, పోక్సో, దిశ వంటి ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. కంటికి రెప్పలా కూతురును కాపాడాల్సిన తండ్రే పలు మార్లు అత్యాచారాని పాల్పడిన సంఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

child rape cases

పూర్తి వివరాల్లోకి వెళిలే.. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత తండ్రే కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల కూతురుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు తండ్రి. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుందనే నెపంతో కక్ష పెంచుకున్న తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పలుమార్లు సొంత కూతురిని రేప్ చేశాడని పోలీసులు వెల్లడించారు. గత శనివారం స్కూల్ ముగిసినా.. బాలిక ఇంటికి వెళ్లకపోవడంతో టీచర్ ఆరా తీసింది. తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడని.. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆ బాలిక చెప్పింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news