కోపంతో హైపర్ ఆది ఫోటో చించిన రష్మీ.. కారణం..?

-

బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తన అందాలను ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటుంది. అందుకే గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. కేవలం బుల్లితెరపై కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజుల వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ కు మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన రష్మీ.. సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.Hyper Aadi : మొద‌టిసారి స్టేజిపైనే ఏడ్చేసిన హైప‌ర్ ఆది.. ర‌ష్మీ, రాంప్ర‌సాద్ చేసిన ప‌నికి..! - Latest News Teluguఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో యాంకర్ రష్మి.. హైపర్ ఆది ఫోటో చించేసి తన కోపాన్ని వ్యక్తం చేసింది. ఇక అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ప్రోమో రిలీజ్ చేశారు. అందులో రాంప్రసాద్ ,పరదేశి, రష్మీ ఆదిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ షోలో భాగంగానే రష్మి కొన్ని ఫొటోస్ తీసుకొస్తున్నామని..ఆ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు మీకు నచ్చకపోతే కారణం చెప్పి ఫోటోలను చించడం లేదా కాల్చడం చేయవచ్చు అని రష్మీ సూచనలు చెప్పింది. ఇక రాంప్రసాద్ ఆది గురించి చెబుతూ ఆది వల్ల ఒక విషయంలో హర్ట్ అయ్యాను అని రాంప్రసాద్ ఆది ఫోటోను తగలబెట్టారు. పరదేశి మాట్లాడుతూ ఆది అన్నా అంటే అన్నీ ఆయనే అని.. కానీ ఒక రీజన్ వల్ల నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది అని అది ఫోటోను పరదేశి ముక్కలు చేశారు.

ఇక రష్మీ కూడా అదే ఫోటోను చించేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆది గారు నన్ను హే రష్మి ఎప్పుడొచ్చావు అని అడగలేదని. ఎప్పుడు వెళ్తున్నావని అడిగారని చెప్పుకొచ్చింది. ఇక రష్మీ ఆది మీరు ఎవరి ఫోటో ను కాల్చబోతున్నారు అని అడగగా..ఆది ఎవరి ఫోటోను కాల్చారో ప్రోమో లో కట్ చేశారు. ఇక ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news