రిషబ్‌ శెట్టి Vs రష్మిక.. రూట్ మార్చిన నేషనల్ క్రష్

-

గత కొంతకాలంగా కాంతార హీరో రిషన్ శెట్టితో జరుగుతున్న కోల్డ్ వార్ కు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లుంది. ఈ విషయంలో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న ష్మిక తాజాగా వాళ్లిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాళ్ల వల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగానని చెప్పింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నటిగా ఇన్ని భాషల్లో పనిచేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఇప్పటివరకూ కెరీర్‌లో నేను మంచి నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే, ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. నటిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు’’ అని రష్మిక పేర్కొంది.

అనంతరం ఆమె సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై స్పందించింది. ‘‘సాధారణంగా నేను మౌనంగా ఉండే వ్యక్తిని. అందుకే మొదట్లో ఎన్ని ట్రోలింగ్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. ప్రేక్షకులపై నాకున్న గౌరవం అలాంటిది. అదీ కాక మొదట్లో నా గురించే విమర్శలు చేసేవారు. అవేమీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, ఇప్పుడు ఆ ట్రోల్స్‌ నా చెల్లి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని అంగీకరించలేకపోతున్నా. నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమే నా బాధ్యత’’ అని చెప్పుకొచ్చింది. జీవితమంటేనే పోరాటమని.. ప్రతి విషయంలోనూ పోరాటం చేయకతప్పదని.. కెరీర్‌ ఆరంభంతో పోలిస్తే సమస్యలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయని అన్నది.

Read more RELATED
Recommended to you

Latest news