హైదరాబాద్ లోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ప్రత్యేకంగా రాష్ట్రపతి నిలయం – తమిళి సై

-

హైదరాబాదులోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ప్రత్యేకమైన అతిగా రాష్ట్రపతి నిలయం నిలుస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై పేర్కొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై… అందరూ ఆరోగ్యంగా …సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వివరించారు.

గతంలో కేవలం 15రోజులు మాత్రమే ప్రజలకు సందర్శనార్థం అనుమతించగా….ఇప్పుడు 11నెలల పాటు ప్రజలకు అనుమతించనున్న రాష్ట్ర పతి గారికి కృతజ్ఞతలు చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై. కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని ప్రత్యేకమైన టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుందని.. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్నవారు రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఫ్లోరైడ్ కోసం అక్కడ ఉన్న స్కానర్లు స్కాన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై.

Read more RELATED
Recommended to you

Latest news