బండి సంజయ్ ఒక అజ్ఞాని..చేతకానీ దద్దమ్మ – రవీందర్ సింగ్

-

బండి సంజయ్ ఒక అజ్ఞాని..చేతకానీ దద్దమ్మ అంటూ నిప్పలు చెరిగారు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్. ఇవాళ తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా తెలం గాణ పౌరసరఫరాల సంస్థ చై ర్మన్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, Brs అనగానే బీజేపీ నాయకులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.

బండి సంజయ్ కి బీజేపీ నాయకులకు.. సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించే నైతిక హక్కు లేదని విమర్శలు చేశారు. బండి సంజయ్ ఒక అజ్ఞాని అని ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా బీజేపీ అధికారంలోకి రాదని వెల్లడించారు. రెండు సీట్లు ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. Brs కూడా అదే విధంగా దేశంలో ఎదుగుతుందని.. అన్ని రాష్ట్రాలు పార్టీలు brs వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news