ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు స్మగ్లర్లు అరెస్ట్..!!

-

టాస్క్ ఫోర్స్ పోలీసులు 22 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని.. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలంలోని అన్నదమ్ముల బండలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 22 ఎర్ర చందనం దుంగలు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఎర్ర చందనం- స్మగ్లర్లు
ఎర్ర చందనం- స్మగ్లర్లు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రైడ్ నిర్వహించామన్నారు. తిరుపతి డివిజన్ బాలపల్లి రేంజ్‌లో కొంత మంది అనుమానాస్పదంగా కనిపించారని.. వారిని పట్టించుకునే ప్రయత్నంలో ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. రైల్వే కోడూరు బుడుగుంటపల్లికి చెందిన సేమూరి శంకరయ్య (27), పొన్నాల రవిశంకర్ (33), దాదినేని వేమయ్య (46)లుగా గుర్తించామన్నారు.

అలాగే తిరుమల పాపనాశనం వద్ద రాజేందర్(40) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. బలపల్లి రేంజ్‌లో మరో వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 22 దుంగలు స్వాధీనం చేసుకోగా.. మొత్తం 480 కిలోలు ఉన్నాయన్నారు. వీటి ధర రూ.45 లక్షల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news