రిలయన్స్ ‘ఇండియా సేల్’ ఆఫర్.. నేటి నుంచే !

-

కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండియా సేల్’ ఆఫర్ మళ్లీ ప్రారంభమైంది. రిలయన్స్ డిజిటల్‌కు చెందిన https://www.reliancedigital.in/ వెబ్ సైట్‌లో నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్స్ అందుబాటులోకి ఉంటుంది. వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ మార్కెట్ సంస్థ ప్రకటించింది.

Reliance
Reliance

రిలయన్స్ డిజిటల్, మై జియోలో హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఏడాది ‘డిజిటల్ ఇండియా సేల్’ ప్రత్యేకత ‘ప్రతి రోజూ గ్రేట్ డీల్స్’. ఈ రోజు నుంచే ఈ థీమ్ అమల్లోకి రానుంది. టీవీలు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, యాక్సెసరీస్ మీద ఆఫర్లు ఉన్నాయి.

అయితే డిజిటల్ ఇండియా సేల్‌లో భాగంగా రిలయన్స్ డిజిటల్‌ టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ల్యాప్ టాప్స్ మీద లాభదాయకమైన ఆఫర్లు అందించడానికి సిద్ధమైంది. అంతేకాకుండా పలుచగా, బరువు తక్కువ ఉండే ల్యాప్ టాప్స్ ధర రూ.22,999/- నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. కన్వర్టబుల్ ల్యాప్ టాప్స్ రూ. 50,999. అలాగే, గేమింగ్ ల్యాప్ టాప్స్ రూ.61,499లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ల్యాప్ టాప్ మీద కచ్చితమైన గిఫ్ట్ (సుమారు రూ.22,444 వరకు విలువ చేసే) లభిస్తుంది. దీనికి షరతులు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది. దీనికి అదనంగా బ్రాండ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల కోసం చూసే ఎదురుచూసే వినియోగదారులకు 18 నెలల వారంటీతో సెలక్టెడ్ మోడల్స్ లభించనున్నాయి. రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు ప్రత్యేకంగా OnePlus Nord ఆగస్టు 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఫిట్ నెస్ ప్రియుల కోసం ఫిట్ నెస్ బ్యాండ్స్, స్మార్ట్ వాచీలను 50 శాతం వరకు డిస్కౌంట్ (సెలక్ట్ మోడల్స్) మీద పొందవచ్చునని రిలయన్స్ సంస్థ యాజమాన్యం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news