కేటీఆర్, పువ్వాడ బిజినెస్ పార్టనర్స్‌…అందుకే రెచ్చిపోతున్నాడు – రేణుకా చౌదరి

-

మంత్రి కేటీఆర్, పువ్వాడ బిజినెస్ పార్టనర్స్‌…అందుకే రెచ్చిపోతున్నాడని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లో కార్యకర్తల పై కేసులు చూస్తూ ఊరుకోబోమని… 26 న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని హెచ్చరించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని… మంత్రిగా అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని.. ఏసిపి ఓవర్ యాక్షన్ ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే… పువ్వాడ కేకులు కట్ చేసి వేడుకలు చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. దేవుడికి కిలో బంగారాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఇచ్చాడు.. దేవుడికి బంగారం ఇచ్చినంత మాత్రానా.. పాపం పోదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. నా వల్ల తప్పు జరిగిందనే భావన కూడా లేదని పేర్కొన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. వెంటనే పువ్వాడ పై వేటు వేయాలన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news