“రిజర్వు డే సెంటిమెంట్”… ధోని ఐపీఎల్ కు ముగింపు నేడేనా ?

-

గత రెండున్నర నెలలుగా నిర్విరామంగా సాగుతున్న ఐపీఎల్ చివరి రోజుకు వచ్చేసింది. వాస్తవంగా నిన్నే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ మరియు చెన్నై జట్ల మధ్య జరగాల్సి ఉండగా వరుణుడు శాంతించకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఐపీఎల్ లో ఫైనల్ కు మాత్రమే రిజర్వు డే ను కేటాయించడంతో మరో అవకాశం ఈ రోజు రెండు జట్లు ఉపయోగించుకోనున్నాయి. కాగా ఇప్పుడు తెరపైకి మరొక్క విషయాన్ని అభిమానులు తీసుకు రావడం చాలా నిరాశను కలిగిస్తోంది. గతంలో ఇదే విధంగా న్యూజిలాండ్ తో 2019 వన్ డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం పడడంతో, రిజర్వు డే ను కేటాయించారు.

 

ఆ తర్వాత రోజు మ్యాచ్ ను ఆడి ఇండియా ఓడిపోయింది. అప్పుడే ధోని తన అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ ఫైనల్ కు రిజర్వు డే ఉండడంతో ఈసారి ఇదే రిపీట్ అవుతుందా అని అభిమానులు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news