సమంతపై గౌరవం ఎప్పటికీ చెరిగిపోదు.. చైతూ షాకింగ్ కామెంట్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువ సామ్రాట్ గా తన తండ్రి నుంచి బిరుదున సొంతం చేసుకున్న నాగచైతన్య వరుస సినిమాలను ఓకే చేస్తూ మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇకపోతే నాగచైతన్య వ్యక్తిత్వం గురించి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతూ ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది హీరోయిన్లు నాగచైతన్య.. తమతో ఎలా ఉంటారు? అందరితో ఎలా ఉంటారు? అనే విషయాలను కళ్ళకు గుచ్చినట్టుగా వెల్లడించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య ఎంత అమాయకుడో.. అంత సహృదయుడు కూడా అని అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా తన భార్య సమంతా గురించి చైతన్య చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి.

నాగచైతన్య – సమంత ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇక ఇదే పరిచయం కాస్త ప్రేమగా మారింది.అలా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు చివరిగా మనం సినిమాలో నటించారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడం జరిగింది .ఇక వివాహం అనంతరం మజిలీ సినిమాలో నటించారు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించలేదని చెప్పాలి. ఇకపోతే నాగచైతన్య తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం అమ్మ చెప్పింది అనే టాగ్లైన్ పెట్టి ఎన్నో రకాల పోస్ట్ లు పెట్టి మరింత ఇబ్బందికి గురిచేసింది.Samantha denies allegations of spreading rumours on Chaitanya - TeluguBulletin.com

అంతేకాదు బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ అక్కడ కాఫీ విత్ కరణ్ షో కి హాజరై నాగచైతన్య పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఇవన్నీ భరిస్తున్నా కూడా నాగచైతన్య సమంతను ఏమి అనకపోవడం గమనార్హం. అంతేకాదు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చి సమంతపై తనకున్న గౌరవాన్ని ఎప్పుడు తగ్గించుకోనని , తన జీవితాంతం సమంతకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తూనే ఉంటాను అని, ఆమె చైతు జీవితంలో ఒక స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. దీన్ని బట్టి చూస్తే సమంత పై నాగచైతన్యకు ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news