ప్రణాళిక లేకుండా పాదయాత్ర జరిగింది.. క్షమించండి !

-

నిన్న పాదయాత్ర ముగింపు సంధర్భంగా ఈరోజు రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. . పాదయాత్ర ని ప్రజలకు చేర్చిన మీడియాకు ధన్యవాదాలు తెలిపిన ఆయన ప్రణాళిక లేకుండా పాదయాత్ర జరిగిందని అందుకే . అందరిని కలవలేక పోయానని అన్నారు. అందుకే క్షమించండని అయన కోరారు. భవిష్యత్ కార్యాచరణలో ఇలాంటి ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడతామని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం చట్టం చేసినా.. అమలు చేయం అని రాష్ట్రం చెప్పుకోవచ్చని, వ్యవసాయ చట్టాలు నిర్బంధం కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ వద్దనుకుంటే అసెంబ్లీలో చట్టం చేయొచ్చని కానీ మోడీకి కేసీఆర్ అమ్ముడుపోయి… చట్టాలు అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. కొత్త చట్టాలు అమలుచేస్తే కొనుగోలు కేంద్రాలు ఉండవని రేవంత్ హెచ్చరించారు. ఇక తాను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news