కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. కెసిఆర్ ఇలాకా లోనే.. !

-

తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఓవైపు బిజెపి మరోవైపు కాంగ్రెస్ లు పథకాలను రచిస్తున్నాయి. ఓవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించబోతుంటే మరోవైపు కాంగ్రెస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ నియోజకవర్గంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం రోజునే గజ్వేల్ లో ఈ సభను నిర్వహించబోతున్నారు.

Revanth reddy

ఈ నెల 24న గజ్వేల్ హౌసింగ్ బోర్డ్ వద్ద సభ ఏర్పాట్లను ప్రారంభించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ చాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ సభకు మాజీ మంత్రి గీతారెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో ఏర్పాటుచేసిన సభ కు ప్రజలు భారీగా తరలివచ్చి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కేసీఆర్ ఇలాకాలో ఏర్పాటు చేయబోయే సభ హైలెట్ గా నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news