కాంగ్రెస్ సభ్యత్వంతో రెండు లక్షల ఇన్సూరెన్స్ : రేవంత్ రెడ్డి

-

నేడు కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వడం అంటే… కాంగ్రెస్ కుటుంబం లో సభ్యుడు కావడమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. సభ్యత్వం తీసుకున్న వాళ్లంతా…సోనియా గాంధీ కుటుంబ సభ్యులు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిల్లర మల్లరా పార్టీలకు మనకు పోటీ కాదు అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

దేశం కోసం కొట్లాడింది కాంగ్రెస్ అని…మిగిలిన పార్టీలో సగం మంది లోఫర్ లు…ఇంకొంత మంది బ్రోకర్లు ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి పార్టీ లో సభ్యులం అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. పేదల కోసం… ఉపాధి.. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను హక్కు గా మార్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి 2లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. ఈ నెల 9 న ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తామని 14 వ తేదీ నుండి 21 వరకు జన జాగరణ యాత్ర నిర్వహిస్తామని అన్నారు. డిసెంబర్ 9న పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అనుమతిస్తే పరేడ్ గ్రౌండ్..లేదంటే నగర శివారులో రాహుల్ గాంధీ తో సభ నిర్వహిస్తామని అన్నారు. జనవరి 26 తో సభ్యత్వ నమోదు ముగింపు చేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news