కాళేశ్వరం కట్టినోడు ఇంజనీర్ ఆ… సన్యాసా : రేవంత్‌ రెడ్డి

-

గత వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. వరదలపై సమీక్ష చేయాల్సిన కేసీఆర్… గాలికి వదిలేసాడంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా.. మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునే పనిలో బిజీ గా ఉన్నాడు కానీ… వరదలు, వర్షాలపై సమీక్ష చేయడం లేదు… కాళేశ్వరం పేరుతో… వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్.. నిండా మునిగింది. పనికి రాకుండా అయ్యింది.

Image

కాళేశ్వరం కట్టినోడు ఇంజనీర్ ఆ… సన్యాసా… నిపుణులు అని చెప్పి… నిండా ముంచాడు. ఐఐఐటీ విద్యార్థులు హాస్పిటల్ లో చేరితే… ఏం జరిగిందో కనుక్కునే సోయి లేదు… పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను.. అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. వందలాదిమంది విద్యార్థులు మంచాన పడ్డా… కొంచం కూడా సోయి లేదు అంటూ విరమ్శలు గుప్పించారు. అయితే నేడు ప్రముఖ నటి, యాంకర్‌ కత్తి కార్తీక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో ఆమెకు కాంగ్రెస్‌ కండువా కప్పి రేవంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news