హైదరాబాద్ లో చిచ్చు పెట్టేందుకు గుజరాత్ మంత్రుల కుట్ర : రేవంత్ రెడ్డి

-

కేంద్ర మంత్రి అమిత్ షాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. గుజరాత్ మంత్రులు హైదరాబాద్ లో కల్లోలం రేపెందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గుజరాత్నునుపాలించిన రాజు హైదరాబాదని పాలించిన రాజు ఒకరేనని అన్నారు. అలాంటప్పుడు గుజరాత్ లో విమోచన వేడుకలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు.

గుజరాత్ లో ఉంది బీజేపీ సర్కారే కదా అలాంటప్పుడు అక్కడ వజ్రోత్సవాలు ఎందుకు జరపడం లేదని అమిత్ షా ని రేవంత్ నిలదీశారు.  హైదరాబాద్ లో కుట్ర చేయడానికి, నగరంలో మత కల్లోలాలు సృష్టించడానికి కేంద్ర మంత్రులు హైదరాబాద్ వస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ కోణంలోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ స్వాంతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయజెండా ఎగురవేసి కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు.

సర్ధార్‌ వల్లాభాయి కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రేవంత్ అన్నారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news