మునుగోడు కాంగ్రెస్ అడ్డా… దాన్నికాపాడుకుంటాం -రేవంత్ రెడ్డి

-

కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం చర్చ జరుగుతుందని.. పార్టీ పెద్దలు అంతా మాట్లాడుతున్నారని తెలిపారు. ఉత్తమ్ ఉదయం మాట్లాడారని.. మునుగోడు కాంగ్రెస్ అడ్డా… దాన్ని పార్టీ కాపాడుకుంటుందని స్పష్టం చేశారు.

జిల్లాల్లో బలమైన నాయకులు ఉన్నారు.. ఏదైనా ఉప ద్రవం వస్తె పార్టీ అలెర్ట్ అవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటల్లో మీడియా అతికించినవి ఎన్నో… కట్టిరించినవి ఎదో తెలీదన్నారు. ఆగస్ట్ 5 వరద బాధితుల కోసం ఆందోళన నిర్వహిస్తామని.. రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తామని ప్రకటించారు.

వరదలో మునిగిన..పంటకు నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఆగస్ట్ 9 నుండి 15 వరకు పాదయాత్రలు ఉంటాయని.. 75 యేండ్ల స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి తో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు రేవంత్‌ రెడ్డి. 75 కిలో మీటర్లు ప్రతి జిల్లాల్లో చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news