కేసీఆర్, కేటీఆర్ లు ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులే.. నిరూపిస్తా : రేవంత్

-

కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు కాదని.. తెలంగాణ తల్లి అంటే సోనియాగాంధీ అన్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణములో అవినీతికి జరిగిందని…కేసీఆర్ , కేటీఆర్ లు ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులేనని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆధారాలతో అన్ని బయట పెడుతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మాత్రమే కెసిఆర్ దర్శనం ఇస్తారని..బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవ విగ్రహం ఊరేగినట్టు… కెసిఆర్ ఇప్పుడు జిల్లాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

125 అడుగుల విగ్రహం పెడతా అని.. పంజాగుట్టలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని స్టేషన్ లో పెట్టారని..యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ లేదని మండిపడ్డారు. Trsలో ఎవరైనా mla చనిపోతే కానీ… ఆ నియోజకవర్గంలో అన్నీ పథకాలు అమలు అవ్వడం లేదని.. టీఆర్ఎస్ లో వంద మంది ఎమ్యెల్యేల పదవులు ఉడిపోతేనే.. తెలంగాణ ప్రజలకు అన్నీ అందుతాయన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కేబినెట్ లో అందరూ రావులేనని..ఈ రావులతో పేదలకు ఏమి రావన్నారు. పేదలకు అన్నీ రావాలంటే…రావులు పోవాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news