రేపు చంచల్‌గూడ జైలుకు రేవంత్‌ రెడ్డి..

-

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంకు దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు టీయర్‌ గ్యాస్ వదిలారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆర్మీ అభ్యర్థి రాకేష్‌ మరణించాడు.

Telangana Congress chief put under house arrest ahead of Bhupalpally visit  - India News

ఆందోళన కారులను కట్టడి చేసిన పోలీసులు.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నాలుగు వైపుల నుంచి కమ్మేసి.. ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్‌ చేశారు. అయితే అరెస్ట్‌ చేసిన ఆర్మీ అభ్యర్థులను చంచల్‌గూడ జైలు తరలించారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు అరెస్టయిన యువకుల కోసం న్యాయవాదులను నియమించినట్టు వెల్లడించారు కాంగ్రెస్ నేతలు.

 

Read more RELATED
Recommended to you

Latest news