కేసీఆర్… నీ అవసరం తప్పితే, తెలంగాణ ఆత్మ గౌరవం పట్టదా.. రేవంత్ రెడ్డి సంచలనం

-

కేసీఆర్… నీ రాజకీయ అవసరాల కోసం తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కోసం గొంతెత్తవా!? పార్లమెంటులో పదే పదే మోదీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తుంటే నీకు సోయి లేదా? అవకాశవాదమే తప్ప… ఆత్మగౌరవం పట్టదా? అంటూ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ రాజ్య సభలో ప్రసంగం వల్ల రెండు విషయాలు బయటపడ్డాయంటూ.. మరో ట్విట్ చేశారు రేవంత్ రెడ్డి. ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్సే తప్ప టీఆర్ఎస్ కాదని, రెండు తెలంగాణను బీజేపీ ఏమీ చేయలేదని.. తెలంగాణను బీజేపీ ద్వేషిస్తుందని అన్నారు. తెలంగాణ అమరవీరులను అవమానించినందుకు మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నిన్న రాజ్యసభలో ప్రధాని మోదీ  చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నాయి. బీజేపీ, మోదీ దిష్టి బొమ్మలను తగలబెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version