ఘనంగా ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్ జరిగింది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్తో రింకూ నిశ్చితార్థం జరిగింది. లక్నోలోని సెంట్రమ్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు క్రికెట్, బాలీవుడ్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.

ఇక ఇవాళ ఎంగేజ్మెంట్ జరుగగా…నవంబర్ నెలలో… రింకు సింగ్ అలాగే ఎంపీ ప్రియా సరోజ్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వారణాసిలో వీళ్లిద్దరి వివాహం నవంబర్ 18వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రింకు సింగ్ కు కాబోయే భార్య ప్రియా సరోజ్.