Breaking : అల్లూరి జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి..

-

ఆంధ్ర ప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే.. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Several Injured After Private Bus Falls in Alluri Sitarama Raju District -  Sakshi

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంగీత ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని భవానీపట్నం నుంచి విశాపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news