BREAKING : ఆటోను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం

-

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. కొమరాడ మండలం చోళవరం వద్ద ఈ ఘటన జరిగింది. కొంతమంది వివాహానికి హాజరై తిరిగి ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో వనపర్తి బస్ డిపోకు చెందిన టీఎస్ 32 టీ 4736 నెంబర్ బస్సు నందిగామ శివారులోని ఐబీపీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైనది.

హైదరాబాదు నుండి వనపర్తికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న డీసీఎం వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది.బస్సు ఎడమ భాగం పూర్తిగా డ్యామేజ్ అవ్వగా, బస్సు సీటులో ఇరుక్కున్న డ్రైవర్ ను వాహనదారులు బయటకు తీశారు. బస్సు ఎడమ భాగం పూర్తి‌గా డ్యామేజ్ కావడంతో ప్రయాణికులకు దిగే ఆస్కారం లేక బస్సులోని అత్యవసర ద్వారం నుండి ప్రయాణికులను దింపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news