గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

-

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్‌ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లోని బిల్వారా నుంచి ముంబయి వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే వడోదరాలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news