ఉప్పల్ లో విద్వంసం సృష్టించిన డీసీఎం.. మూడు వాహానాలను డీ కొట్టి !

-

ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి చెందారు. వెనక నుండి మితి మీరిన వేగంతో వచ్చిన డీసీఎం టూవీలర్ ను ఢీకొట్టింది. డీసీఎం వెనకాల ఉన్న లారీ అదుపు తప్పి డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మొత్తం మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకరు చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

తెల్లవారుజామున 5:30 నుండి 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆలయం తెరుచుకుని ఉండి ఉంటే ప్రమాద తీవ్రత చాలా పెద్దగా ఉండేదని అంటున్నారు. ఉప్పల్ రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎంఎల్ఏ సుభాష్‌రెడ్డి న్యూఇయర్ రోజే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పొగమంచు, ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news