హైదరాబాద్‌లో రాకెట్‌ తయారీ కేంద్రం

-

తెలంగాణ రాష్ట్రంలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ అలాగే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దేశంలోనే ప్రైవేటు రంగంలో తొలి రాకెట్లు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ ఏరు స్పేస్ అభినందన సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాకెట్ డిజైన్ మరియు పరీక్ష కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు.

దేశం అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన స్కై రూట్ కు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని వివరించారు మంత్రి కేటీఆర్. భారత అంతరిక్ష రంగానికి ఇది చారిత్రాత్మక సందర్భం అని పేర్కొన్నారు. రాకెట్ లాంటిది సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం సులభం కాదన్న కేటీఆర్ తొలి ప్రయత్నంలో అంతరిక్షంలోకి రాకెట్ ను పంపగలిగే సత్తా సంపాదించడం మామూలు విషయం కాదని కొనియాడారు. స్పీచ్ టెక్నాలజీకి హైదరాబాదు రాజధానిగా మారుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభవం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news