సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్న రోహిత్ అభిమానులు..!

-

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. యాక్టివ్ గా ఉండడమే కాదు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు వీరేంద్ర సెహ్వాగ్. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు.

రోహిత్ శర్మ ప్లేస్ లో సౌరబ్ తివారి జట్టు లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సౌరభ్ తివారిని వడ పావ్ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ను ఉద్దేశంలో ఉంచుకునే వీరేంద్ర సెహ్వాగ్ ఈ తరహా కామెంట్ చేసినట్లు రోహిత్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ చరిత్రలో ఒక దిగ్గజ క్రికెటర్ గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఇలాంటి కామెంట్స్ చేయండం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news