విశాఖలో రోజా బాక్సింగ్ పంచ్ లు..వీడియో వైరల్

-

విశాఖలో ఏపీ మంత్రి రోజా పవర్ పంచ్ లతో రెచ్చిపోయారు. బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించేందుకు వచ్చి బాక్సింగ్ చేశారు టూరిజం మంత్రి రోజా. ఆల్ ఇండియా ఆహ్వాన సీఎం కప్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను సాగర తీరంలోని ఫ్లడ్ లైట్ వెలుతురుతో ఆదివారం రాత్రి ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. గెలుపోటములు సహజం, జాతీయస్థాయి పోటీకి ఎదగడం గెలుపుతో సమానమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా విజేతగా నిలవాలంటే పట్టుదల ఉండాలన్నారు. బాక్సింగ్ క్రీడలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం మంత్రి అమర్నాథ్ తో కలిసి ఈ ప్రాంగణం నుంచే ఉద్యమించానని, రాజధాని కోసం విశాఖ గర్జనలో పాల్గొన్నానని రోజా గుర్తు చేశారు. అయితే, మంత్రి రోజా బాక్సింగ్ చేసిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news