శ్వాస తీసుకోవాలా? వద్దా? అనేది కేసీఆర్‌ ను అడుగు – పవన్‌ పై రోజా హాట్‌ కామెంట్స్‌

-

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో జరిగిన ఏపీ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పవన్ వాహనం వారాహి కాదని, అది నారాహి అని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం పవన్ కత్తులతో ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడన్నారు. ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలనుకుంటున్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందని రోజా ఎద్దేవా చేశారు. పవన్ వాక్యాలపై సీఎం జగన్ స్పందించాల్సిన పని లేదన్నారు. మీడియా అనవసరంగా పవన్ కు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. హైదరాబాద్ లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా? వద్దా? అనేది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని రోజా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news