అన్ని కులాలకు సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీయే : ఆర్ఎస్పీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో 1,50,000 కోట్లు గోదావరి పాలయ్యాయి. ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవంబరు 30వ తేదీన కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ పార్టీల గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలి.

R.S.PRAVEEN KUMAR: త్యాగాలు ఒకరివి.. భోగాలు మరొకరివి:  ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్​,  bsp-leader-rs-praveen-kumar-serious-comments-on-cm-kcr

బీర్లు క్వార్టర్లు మా పేదలకు పంచి… డబ్బులు, పదవులు మీకా? అని నిలదీశారు. కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. బీఎస్పీ అధికారంలోకి ఓస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రోడ్డెక్కితే ప్రజలు రాళ్లతో కొడతారన్నారు. కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు. కోయ, లంబాడి చిరు ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్‌తో తాను వస్తున్నానని, రేపటి రోజున బహుజనులే హెలిక్యాప్టర్లకు ఓనర్లు అవుతారన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news