బస్సు డిపోల మూసివేతపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..

-

బస్సు డిపోల మూసివేత్తపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బస్సు డిపోలను మూసేస్తున్నారు..భూములు అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయని…ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదని సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని.. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులను , సిబ్బందిని మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆర్టీసీ వైపు మల్లుతున్నారని.. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆదాయం పెరిగింది.. ఓఅర్ కూడా పెరిగిందని తెలిపారు.

భూములు అమ్మాలనే ఆలోచన లేదని.. 1359 రూట్లలో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించామని వెల్లడించారు. బస్సులు అవసరం ఉన్న చోట లోకల్ డిఎం , ఆర్ ఎం లు సర్వే చేస్తున్నారన్నారు.. కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువ..కొన్నిచోట్ల ఎక్కువ ఉందని.. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డిఎంని సంప్రదించాలని వెల్లడించారు.

జోగులంబ వెళ్ళినప్పుడు భక్తులు బస్సు అడిగారు.. వచ్చే శనివారం నుండి జోగులంబకు హైదరాబాద్ నుండి స్పెషల్ బస్సు నడుస్తుందన్నారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించాలని.. డీజిల్ పెరుగుదగల, కరోనా వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యమని.. సీబీఎస్ హాంగర్ ప్లేస్ లో ఆర్థిక పరిస్థితి దృష్ట ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బస్ స్టాండ్ లలో ఎలాంటి పార్కింగ్ దందా లేదని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news