వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం ఎందుకు.. పదవి నుంచి దిగిపోండి- వైఎస్ షర్మిళ

-

వడ్ల కొనుగోలు వ్యవహరంపై మరోసారి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిళ మరోసారి కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. షర్మిళ ట్విట్టర్ లో స్పందిస్తూ… పలు విమర్శలు చేశారు.

’’’కష్టాలొస్తే ఆదుకుంటారని రైతులు ఓట్లు వేసింది మీకు. రైతుకు భరోసా ఇవ్వండని బాధ్యత ఇచ్చింది మీకు. వాళ్లెవరో కొనట్లేదని మీరు కూడా రైతును నట్టేట ముంచితే ఎట్లా?.. బాధ్యత మీది కానప్పుడు పదవి మీకెందుకు..? వడ్లు కొనే చేతకానప్పుడు అధికారం మీకెందుకు..?.

ఎవరో కొంటారనే ఆశకు వరి వేసేదైతే ..ఎవర్నడిగి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ కాళేశ్వరాన్ని కట్టారు..?. రైతుల వడ్లు కొననప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఏం లాభం..? చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తాం అని చెప్పినవన్నీ మీ కమిషన్ల కోసమేనా..? ఆకుపచ్చ తెలంగాణ అంటే రైతు జీవితాలను ఆగం చేయడమా..? రైతు నోట్లో మట్టి కొట్టడమా..?

వాపును చూసి బలుపు అనుకుని, నిన్నటి వరకు చివరి గింజ వరకు కొంటానని చెప్పి చేతులెత్తేశారు. ఈ రోజు రైతులను మోసం చేశారు. మీ చేతకాని తనానికి రైతులను బలిచేశారు. కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్టుంది మీ తీరు కేసీఆర్ గారు.

మేము భయంకరమైన ఉద్యమకారులం .. వడ్లు కొనకపోతేకేంద్రాన్ని వెంబడిస్తాం, మెడలు వంచుతాం అని చెప్పిన మీరు, ఈ రోజు మెడలు వంచుకొని వడ్లు కొనేది లేదంటున్నారు, పేగులు తెగే దాక కొట్లాడిన అని చెప్పే కేసీఆర్ గారు, కేంద్రం తీగ లాగితే మీ అవినీతి పేగులు కదులుతాయని కొట్లాట బంద్ పెట్టిండ్రా? రైతులు గల్లా పడుతరని తప్పించు కుంటున్నవా?.

మీరు రైతులను కోటీశ్వరుల చేస్తే ఏడేండ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు చనిపోయిండ్రు? వడ్లు కొనకుండా రైతుల ఉసురు తీసుకొంటున్న రైతు ద్రోహులు మీరు. వడ్లు కొనలేనప్పుడు మీ పదవికి రాజీనామా చేయండి .. అధికారం నుండి దిగిపోండి.‘‘ అంటూ షర్మిళ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news