టీమిండియా ఆల్ రౌండర్ పాండ్యా సంచలన నిర్ణయం… !

-

టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బరోడా జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో తన టీం ఫెయిలవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు క్రునాల్ పాండ్య. జనవరి మాసం లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 2020 సీజన్ మధ్య లో కృనాల్ పాండ్యా తండ్రి మరణించడంతో అకస్మాత్తుగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు బరోడా కెప్టెన్.

ఇక తాజాగా తన టీం ఫెయిల్ కావడంతో రాజీనామా చేస్తున్నట్లు కృనాల్ పాండ్యా కీలక ప్రకటన చేశారు. కృనాలు పాండ్య స్థానంలో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా టీం కోసం సారథిగా దేవ ధర్ వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2020 లో దీప కూడా పాండ్య బూతులు తిట్టడంతో అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news