కొంపముంచిన డెస్టినేషన్ మ్యారేజ్.. రూ.2కోట్ల వజ్రాల నగలు మాయం

-

డెస్టినేషన్ మ్యారేజ్ ఓ కుటుంబం కొంప ముంచింది. పెండ్లి కోసం అని రాత్రి బయటకు వెళ్లి వచ్చేసరికి హోటల్ గదిలో ఉంచిన రూ.2కోట్ల విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. వివాహం మాట దేవుడెరుగు అంటూ లబోదిబోమంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

డెస్టినేషన్ మ్యారేజ్ కోసం అని ఓ కుటుంబం ముంబయి నుంచి జైపూర్‌కు వచ్చింది. రాధా రామన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం రాత్రి హొటల్ గదిలోనే రూ.2కోట్ల విలువైన వజ్రాల నగలను పెట్టి, వివాహానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి నగలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. హోటల్ సిబ్బందినే చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. గది తాళాలను హోటల్ సిబ్బందికి అప్పగించి వెళ్లామని, తాళం లేకుండా ఇతరులు లోనికి వచ్చే అవకాశమే లేదని, హోటల్ స్టాఫ్ దొగలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హోటల్ లోనికి వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. హోటల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించడంతోపాటు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news