Saani Kaayidham: మరో నేషనల్ అవార్డు గ్యారంటీ..‘సాని కాయిధమ్’ టీజర్‌లో అదరగొట్టిన కీర్తి సురేశ్

-

నేషనల్ అవార్డ్ విన్నర్, ‘మహానటి’ కీర్తి సురేశ్..క్రిమినల్‌గా మారింది. తుపాకి పట్టి ఒకరిని కాల్చేసి జైల్లోకి వెళ్లి చిప్పకూడు తినాలని డిసైడ్ అయింది. అవునండీ..ఇదంతా నిజమే.. ‘సాని కాయిధమ్’ పిక్చర్ టీజర్ లో కీర్తి సురేశ్ ను చూస్తుంటే నిజంగానే…కీర్తి సురేశ్ అలా చేస్తుందని మీకు తప్పకుండా అనిపిస్తుంది.

డార్క్ రిలేషన్ షిప్ రివెంజ్ డ్రామాగా వస్తున్న ‘సాని కాయిధమ్’ పిక్చర్ టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. సదరు టీజర్ లో కీర్తి సురేశ్ క్రైమ్ చేసే వ్యక్తిగా కనబడుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ చిత్రంలో నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే నెల 6న విడుదల కానుంది.

ఇక ఈ చిత్ర టీజర్ లో కీర్తి సురేశ్ నటనను చూస్తుంటే ఆమె మరోసారి నేషనల్ అవార్డు గెలుచుకోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. అన్యాయానికి గురైన బాధితురాలు వ్యక్తం చేసే ఆగ్రహం ఎంత రియల్ గా ఉంటుందో కీర్తి సురేశ్ కళ్లల్లో కనబడుతోంది.

ప్రతీకారంతో రగిలిపోతున్న ఆమెకు, సెల్వ రాఘవన్ ఏ సాయం చేశాడు? కీర్తి సురేశ్ తనకు అన్యాయం చేసిన వారిని తుపాకితో కాల్చి చంపిందా? అనే విషయాలు తెలియాలంటే వచ్చే నెల 6న అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే ‘సాని కాయిధమ్’ పిక్చర్ చూడాల్సిందే. ఈ చిత్ర టీజర్ చూసిన సినీ అభిమానులు, ప్రముఖులు షాక్ కు గురయ్యారు. కీర్తి సురేశ్ ఇంత రా రోల్ ప్లే చేసిందా అని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news