షర్మిల పార్టీపై సజ్జల షాకింగ్‌ కామెంట్స్‌… జగన్‌ వద్దన్నాడు !

-

తాడేపల్లి :వైఎస్‌ షర్మిల తెలంగాణ ప్రారంభించ బోతున్న  కొత్త పార్టీపై సజ్జల రామకృష్ణా రెడ్డి మరోసారి స్పందించారు. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలని షర్మిల అనుకున్నప్పుడే జగన్ వద్దని వారించారని.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా పక్క రాష్ట్రాల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నది జగన్ విధానమని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డం వచ్చే ఏ అంశాన్ని జగన్ ఎంటర్ టైన్ చేయదలుచుకోలేదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని షర్మిల ప్రకటించిన నేపథ్యంలో అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదనే సీఎం జగన్‌ ఇడుపులపాయకు సాయంత్రం వెళుతున్నారని వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా ముఖ్యమంత్రి తన షెడ్యూల్ ను మార్చుకున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్న విధానానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన సజ్జల… స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పరిమితులు ఉన్నాయని… మరోసారి కేంద్రం ముందు మా గళాన్ని వినిపిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news